మన్యం టీవీ, కరకగూడెం:
కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్ష్మి బంగారు పథకమని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు లబ్దిదారులకు కరకగూడెం మండల తహశీల్దార్ కార్యాలయం నందు కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ రాజేశ్వర కుమార్,స్థానిక సర్పంచ్ ఊకే రామనాథం,ఉప సర్పంచ్ రవి,రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: