ప్రభుత్వ లక్ష్యాలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
అభివృద్ధి పనులను అతి త్వరలో పూర్తిచేయాలి
కరోనా తగ్గుతున్న నేపద్యంలో విస్తృత పర్యటనలు,అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యం
కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు సిద్ధం గా ఉండాలి:విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
పట్టణ ప్రగతి మరియు పల్లె ప్రగతి కార్యక్రమాల విస్తృత స్థాయిలో నిర్వహించాలి అని విప్ రేగా కాంతారావు తెలిపారు.ప్రభుత్వ లక్ష్యాలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు.
అభివృద్ధి పనులను అతి త్వరలో పూర్తిచేయాలి అని తెలిపారు.కరోనా తగ్గుతున్న నేపద్యంలో విస్తృత పర్యటనలు,అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యం కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు సిద్ధం గా ఉండాలి అని విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు.పార్టీ కి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా మన పర్యటనలు ఉండాలని కోరారు.సీఎం కేసీఆర్ 20 వ తేది నుండి జిల్లాల పర్యటన లో భాగంగా పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పనులను పరిశీలిస్తారు అని,ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేయబడ్డ ఎంపీడీఓ,ఎంపీవో,జీపీ సెక్రెటరీ లదే పూర్తి బాధ్యత అని,ఎవరి మీద నైనా తగిన చర్యలు తీసుకుంటాను అని సీఎం గారు ప్రకటించిన విషయం మీ అందరికి తెలిసిందే,ఇందులో భాగంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.ఇక సీఎం కేసీఆర్ తో పాటు పర్యటన లో కలెక్టర్ తో సహా జిల్లా ఉన్నతాదికారులు మరియు స్థానిక మంత్రి పర్యటన లో పాల్గొంటారు.మంత్రి పువ్వాడ.అజయ్ కుమార్ ఆకస్మిక పర్యటనలు ఉంటాయి అన్నారు. సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,మండల అధికారులు 19 వ తేదీ నుండి గ్రామాలలో తప్పని సరిగా పర్యటనలు ఉండాలి అన్నారు.పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాల పూర్తి వివరాలు తెలుసుకొని పరిశీలించండి అని, అసంపూర్తిగా ఉంటే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ మరియు గ్రామ కార్యదర్శి,సర్పంచుల కు పనులు పుర్తిచేయుటకు మౌలీక ఆదేశాలు జారిచేయండి అని తెలిపారు.ప్రాధానంగా మన నియోజక వర్గంలో 1.పినపాక 2.ఆళ్లపల్లి మండలాల్లో పనులు మరియు పారిశుధ్యం పై దృష్టి సారించాలి అని అధికారులు తెలిపారు. మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు మిరే బాద్యులు అవుతారు.కనుక ప్రభుత్వ లక్ష్యాలు: 1.పల్లెప్రకృతి వనాలు 2.వైకుంఠ దామాలు 3.డంపింగ్ యార్డులు 4.కరెంట్ పనులు 5.పాడుపడ్డ బిల్డింగ్ లను కూల్చడం లపై
6.త్రాగునీరు మరియు ఇతర మౌళికవసతుల కల్పనలో దృష్టి సారించాలి అన్నారు.
Post A Comment: