మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో బుధవారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్, గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగదీష్ లా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మండల అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు గౌరవ వేతనం పెంచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచిన గొప్ప దర్శనీకుడని, గొప్ప పరిపాల దక్షకుడు అని ఏటూరు నాగారం మండల పార్టీ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో- ఆప్షన్ సభ్యులు ఎండి వలియాబీ సలీం, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, ఎంపీటీసీలు భరత్, స్వప్న చంద్రబాబు, అల్లి సుమలత శ్రీనివాస్, సర్పంచులు జిట్టా సుమలత ఈశ్వర్, కాక వెంకటేశ్వర్లు, దొడ్డ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు, మండల యూత్ అధ్యక్షులు కొండాయి చిన్ని, రైతు సమన్వయ సమితి గ్రామ కో- ఆర్డినేటర్ దనపునేని కిరణ్ కుమార్, అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు చందా లక్ష్మీనారాయణ, పెండ్యాల సతీష్, మీడియా ఇన్ఛార్జి బోజా రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: