మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురంమండల పరిధిలోని మొండికుంట లో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పర్యటించారు. మొండికుంట గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీ పనులను ఆమె పరిశీలించారు. పనులపై డిప్యూటీ సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతి సెక్రటరీ సైదులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: