మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం, కాకర్ల, గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ ప్రత్యేక పథకాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 7 గంటలకే పడమట నర్సాపురంలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అక్కడే ఉన్న పంచాయతీ వర్కర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకర్ల గ్రామపంచాయతీ లోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, రైతు వేదిక,లను పరిశీలించారు. గ్రామ కార్యదర్శి సకాలంలో విధులకు హాజరు కానందున ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శులు ఉదయం 6 గంటలకే పంచాయతీలలో అటెండ్ అయి పారిశుద్ధ్య పనులను చేయించాలని ఆదేశించారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు కలెక్టర్ ను కలిసి 82 సర్వే నెంబర్ లో పేదల ఇళ్ల స్థలాల కు కేటాయించిన నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీడీవో, ఎంపీఓ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: