కరోనాకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందించాలి
కరోనాతో మరణించిన వారికి 5లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలి
మన్యం టీవీ మంగపేట.
కాంగ్రెస్ మంగపేట మండల ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య మన్యం టీవీ తో మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకొని యుద్ధ ప్రాతిపాధికన వాటిని అమలు చేయాలి, కరోనా టెస్ట్లు పెంచాలి, ఇంటి ఇంటికి ఆరోగ్య సర్వే నిర్వహించాలి, అనారోగ్యం తో బాధ పడుతున్న వారికి ఇంటికే మెడిసిన్ సప్లై చేయాలి, కరోనా బారినపడ్డవారిని ప్రభుత్వం ఆదుకోవాలి, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి వైద్యం అందించాలి, కరోనా తో మరణించిన వారికి 5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని ఒక ఈ సందర్బంగా పేర్కొన్నారు.తెలంగాణ లో వైద్య సిబ్బంది చాలా తక్కువగా ఉందని వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలి,ఇంకా మెరుగైన విద్యా సౌకర్యం కల్పించి తెలంగాణాను ప్రగతి పధంలో పయనించేందుకు సహకరించాలి అందుకు బోధన సిబ్బంది నియమించాలి ప్రతి సంవత్సరం డి ఎస్ సి నిర్వహించాలి. బంగారు తెలంగాణ కావాలంటే విద్యార్థుల భవిష్యత్తు మారాలంటే నీళ్లు, నిధులతో పాటు నియామకాలు ప్రతి సంవత్సరం జరగాలి. చదువుకొని, ఉద్యోగాలు రాక, లేక, ఎదురు చూసి,ఉద్యోగవయసు కూడా తీరిపోతున్న ఎంతో మందికి అనేక రంగాలలో లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయటం ద్వారా నిరుద్యోగులను ఆదుకువాలి అని ఈ సందర్బంగా కాంగ్రెస్ మంగపేట మండల ప్రధాన కార్యదర్శి మైపా లాలయ్య పేర్కొన్నారు.
Post A Comment: