మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని పొదుమూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షభాన వీరి భర్త ఇటీవలకాలంలో చనిపోయారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితి ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వీరిని పరమార్శించి వీరికి వారంరోజులు సరిపడా బియ్యం కూరగాయలు వంటసామాగ్రి ఇవ్వడం దాతలసహకారంతో జరిగింది. దయచేసి ఇలాంటి వారికి మీ వంతుగా సహకరించగలరని జ్వాలా ట్రస్ట్ నుంచి కోరుకుంటున్నాం .ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ చైర్మన్ బండపల్లి రవి గౌడ్, డైరెక్టర్లు కళ్లెబోయిన సురేష్ గారు,మునిగాల రాకేష్,చాదా మల్లయ్య గారు పాల్గొన్నారు.
Post A Comment: