రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.20 వేల రూపాయల వితరణ
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు అడపా. వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతుండగా,విషయం తెలుసుకుని ఆదివారం విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని పరామర్శించారు.అనంతరం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ను వారికి అందించారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, సర్పంచ్ కాయం. తిరుపతమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ నాయకులు వేముల.లక్ష్మయ్య,గణేష్ స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: