మన్యం టీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పేట లో తెలంగాణ సియల్పి నేత మధిర నియోజక వర్గ కాంగ్రెస్ యంయల్ఏ మల్లు బట్టి విక్రమార్క వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు, ఓబిసి జిల్లా అధ్యక్షులు తుమ్మారాంబాబు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు వేముల భారతి సత్యవరపు తిరుమల చేతుల మీదుగా కేక్ కట్చేయించి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమం ని ఉద్దేశించి తుమ్మ రాంబాబు మాట్లాడుతూ బట్టి తెలంగాణ గర్వించదగ్గ నాయకుడు అని విశ్వనీయత గల నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరపడం సంతోషాన్ని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నం శెట్టి రామకృష్ణ, సంగ ప్రసాద్, బండారు మహేష్, వేముల ప్రతాప్, సత్యవరపు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: