మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి అశ్వారావుపేట మండలం మొద్దుల మడ గ్రామం లో కోవిడ్ భాదితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. అదే విదంగా సున్నం బట్టి ఆశ్రమ పాఠశాల లో ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వున్నా భాదితులను ఏంఎల్ఎ మెచ్చా తో ఫోన్ ద్వారా మాట్లాడించి వాళ్లలో దైర్యం పెంపొందించారు. అదే విందంగా కరోనా వార్డు లో ప్రతి ఒక్కరికీ టిఆర్ఎస్ పార్టీ తరుపున వారికీ ఆయుర్వేదం ఇమ్యూనిటీ బూస్టర్ ఒక్కొక్కటి 856/- రూపాయల విలువుగల వెచ్చించి 16 బాటిల్లను తెప్పించి కరోనా పేషెంట్లకు ఇవ్వమని పంచాయతీ సెక్రెటరీ కి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అక్కడున్న ప్రతి ఒక్కరికి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, విఆర్ఓ లాలూ, కార్యదర్శి నాగేశ్వరావు, తెరాస పార్టీ యువజన నాయుకులు రఘురామ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: