పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్న జ్వాలా యూత్
మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని కమలాపురం గుడ్డేలుగులపల్లికి చెందిన బానారి నర్సయ్య భార్య దుర్గమ్మ వీళ్లకు ఒక కూతురు ఉన్నారు. నర్సయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో చనిపోయారు పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారు సరైన ఇల్లు కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వీరిని పరమార్శించి మేమున్నాం అని ధైర్యం చెప్పి వీరికి 1500 రూపాయలు మరియు వారం రోజులు సరిపడా బియ్యం కూరగాయలు వంటసామాగ్రి ఇవ్వడం జరిగింది.రోజు ఏదో ఒక గ్రామంలో సహాయ సహకారాలు అందిస్తున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పలువురి ప్రశంశలు అందుకుంటున్నారు.
ఈ కార్య క్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య గారు,కళ్లెబోయిన సురేష్ గారు, మునిగాల రాకేష్,ఆత్మకూరి సతీష్,పుల్లంశెట్టి అజయ్,సయ్యద్ బాబా,ముప్పా మోహన్, తదితర సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: