CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చత్తీస్ గడ్ లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఎత్తివేయాలనే తీవ్రమవుతున్న ఉద్యమం

Share it:

 


మన్యం మనుగడ, చర్ల:

 ఆదివాసీఉద్యమం

చత్తీస్ గడ్ లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఎత్తివేయాలనే ఉద్యమం తీవ్రమవుతున్నది. ఒకవైపు 40 రోజులుగా సిల్గర్ సీఆర్పీఎఫ్ క్యాంపుకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు అనేక జిల్లాలకు విస్తరిస్తున్నది. దంతెవాడ జిల్లా నహరిలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపును ఎత్తివేయాలనే డిమాండ్ తో ఆ క్యాంపు బాధిత గ్రామల నుండి వేలాది ఆదివాసులు పోరాటానికి నడుం భిగించారు. అనేక గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించారు.

కాగా భీజాపూర్ జిల్లా సిల్గర్ లో సీఆర్పీఎఫ్ క్యాంపును ఎత్తివేయాలనే డిమాండ్ తో శాంతియుత నిరసన చేస్తున్న ఆదివాసులపై గత నెలలో పోలీసులు కాల్పులు జరిపి నలుగురిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆదివాసులను హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, సిల్గర్ సీఆర్పీఎఫ్ క్యాంపును ఎత్తి వేయాలనే డిమాండ్ తో 40 రోజులకు పైగా అక్కడ ఆదివాసుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నప్పటికీ సిల్గర్ సీఆర్పీఎఫ్ క్యాంపు ఎదురుగా ఆదివాసులు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న కాంకేర్ లో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు ఆదివాసులు.

ఇప్పుడిక దంతేవాడ జిల్లాలో ఉద్యమం ఊపందుకుంది. నహరిలో సీఆర్పీఎఫ్ క్యాంపు ఎత్తేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని ర్యాలీలో పాల్గొన్న ఆదివాసులు చెబుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: