మన్యం టీవీ ఏటూరు నాగారం
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఏటూరు నాగారం పరిధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కొరకు బ్రిడ్జి కోర్స్ మెటీరియల్ ముద్రణ కొటేషన్లకు మరియు వస్తువుల సరఫరా చేయుటకు దరఖాస్తులు కోరుచున్నారు. ఈ దరఖాస్తులను 01-07-2021న ఉప సంచాలకులు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఐటిడిఎ నందు దరఖాస్తులు స్వీకరించ బడును సాయంత్రం ఐదు గంటల లోపు తీసుకొనబడును తదుపరి వచ్చిన కొటేషన్లు స్వీకరించబడవు. ఈ కొటేషన్స్ ను 02-072021 న ఉదయం 11 గంటలకు ఏటూరు నాగారం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆధ్వర్యంలో హాజరైన ప్రజాప్రతినిధుల సమక్షంలో తక్కువ రేట్లకు ప్రతిపాదించిన వారికి ఉత్తర్వులు ఇవ్వబడును.
Post A Comment: