*జాతీయ రహదారిపై సంబురాలు జరుపుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ )అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఆనుముల రేవంత్ రెడ్డి ఎన్నిక కావడాన్ని హర్షిస్తూ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం రాత్రి జాతీయ రహదారిపై బాణాసంచా కాలుస్తూ,స్వీట్లు పంచుతూ సంబురాలు నిర్వహించుకున్నారు.ఈసందర్భంగా నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపికచేయడం సంతోషకరం అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్,ఎంపీటీసీ సభ్యుడు మాపురపుతిరుపతిరెడ్డి,చింతనిప్పుల బిక్షపతి,గందే శ్రీను,కూనురు అశోక్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, సర్పంచ్ భద్రయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు,తారక్,జిల్లా అధికార ప్రతినిధి వంశీకృష్ణ,షకిల్ పాషా,జాఫర్,నెల్లుట్ల రాజన్న,నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: