దోమల నుండి రక్షణ కోసం దోమతెరలు వాడాలి వైద్యుడు రవి చంద్
గుండాల ( మన్యం టీవీ) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దానితోపాటు దోమల నుండి రక్షణ కోసం దోమతెరలు వాడాలని ప్రాథమిక వైద్యశాల వైద్యుడు రవి చంద్ సూచించారు. మండలం పరిధిలోని నరసాపురం తండా రాళ్ల గడ్డ తండా గ్రామాల్లో సి హెచ్ ఓ శ్రీహరితో కలిసి దోమ తెరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఇంటి చుట్టూ నీళ్లు నిలవ ఉండటం ద్వారా దోమలు వృద్ధి చెందుతాయని మురికి నీటిలో కిరసనాయిల్ పోయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన సూచించారు. దోమల నుండి రక్షణ పొందాలంటే దోమ తెరలను వాడాలి అన్నారు. మొత్తం మండలంలో 47 గ్రామాలకు దోమ తెరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది అన్నారు గత ఏడాది 11 గ్రామాలకు పంపిణీ చేశామని ఇప్పటివరకు 17 గ్రామాలకు పూర్తిస్థాయిలో పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. మిగిలిన గ్రామాలకు త్వరలోనే ఆంధ్ర చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ ,మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ పెండ్లి కట్ల సత్యం ,ఆశా వర్కర్ వినోద ,సరోజన తదితరులు పాల్గొన్నారు
Post A Comment: