మన్యం టీవీ కొత్తగూడెం:-
జూన్ 27 ఆదివారం నాడు కొత్తగూడెం మున్సిపాలిటీ లోని ఎం జీ రోడ్డు నందు ఏడో విడత హరితహారం ను ప్రారంభించి, మొక్కలు నాటిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని నిర్వహిస్తున్నారని, తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ వాయువు పెరుగుతుందని, దీని వల్ల రాబోయే తరం కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు కొల్లాపూరి ధర్మరాజు, బండి నరసింహా, అంబుల వేణు, సత్యభామ, కూరపాటి విజయలక్ష్మి, మోర రూప, గుమ్మడవెల్లి కళ్యాణి, వనచర్ల విమల, కో ఆప్షన్ సభ్యులు యాకుబ్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, కంభంపాటి దుర్గాప్రసాద్, బీమా శ్రీధర్, యూసుఫ్, తాటిపల్లి శంకర్ బాబు, సుందర్ రాజ్, మసూద్, మోర రమేష్, కూరపాటి సుధాకర్, వి. కొండ స్వామి, సుందర్ లాల్ కోరి, పూర్ణ, పిల్లి కుమార్, అరుణ్, గాయత్రి, కృపా వేణి, నక్క సృజన, కాళీ, ఐ కే సత్యనారాయణ, కాసుల సాయి, మజీద్, దొమ్మేటి నాగేశ్వరరావు, రామారావు మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: