CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వ్యాధి సోకిన కాంట్రాక్ట్ కార్మికులకు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

Share it:

 


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  మణుగూరు సింగరేణి, ఎస్ఎంఎస్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తూ కరోణ వ్యాధి సోకి 15 రోజుల పాటు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ కార్మికులు సత్యనారాయణ,బాలకృష్ణ అను వారికి సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు 4 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సిఐటియు నాయకులు అందజేశారు.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగాని కృష్ణయ్య,సిఐటియు జిల్లా కార్యదర్శి గద్దల.శ్రీ నివాస్, బ్రాంచ్ అధ్యక్షులు బి, కృష్ణయ్య,చేతుల మీదుగా కాంట్రాక్ట్ కార్మికులకు నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణిలో కరోనా వ్యాధి సోకిన కాంట్రాక్ట్ కార్మికులకు వేతనం చెల్లించాలని,కరోణ వల్ల మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని,పర్మినెంట్ కార్మికుల మాదిరిగా కుటుంబ సభ్యులు అందరికీ ఉచిత వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాధవ్ ఎస్ ఎం ఎస్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: