CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

🔹ప్రాణాపా స్థితిలో ఉన్న రోగికి ఆక్సీజన్‌ సిలీండర్‌ పంపిణి..

Share it:

 


🔹టిఎన్‌ఆర్‌ ట్రస్ట్‌, యుకెఎంసి కేంద్రం ద్వారా సిలెండర్ అందజేత..


🔹కోవిడ్‌తో ఎవరూ మృతిచెందవద్దనే మా తపన


♦️సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌ పాషా..


మన్యం టీవీ పాల్వంచ:-

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా పేషంట్‌కు *టీఎన్‌ఆర్‌ ట్రస్ట్‌, యూనియన్‌ కొమరయ్య కోవిడ్‌ సహాయక కేంద్రం* ఆద్వర్యంలో బుధవారం ఆక్సీజన్‌ సిలీండర్‌ను అందజేశారు.. బాదితుడి కుటుంబ సభ్యులు యుకెఎంసి కేంద్రాన్ని సంప్రదించడంతో స్పందించిన సభ్యులు ఆక్సీజన్‌ సిలీండర్‌ను బాదితుడి స్వగృహం రైటర్‌ బస్తి, గొల్లగూడెంకు వెల్లి వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. సిలీండర్‌ను అందజేసిన అనంతరం *యుకెఎంసి సహాయ కేంద్రం ఛైర్మన్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌ పాషా* మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాధితో అనేక మంది మృత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డారని, ఇలాంటి పరిస్థితులు మరెవరికి రాకూడదనే లక్ష్యంతో సహాయ కేంద్రం తమ సేవలను ముందుకు తీసుకెలుతోందన్నారు. రోగులకు, సహాయకులకు ఉచితంగా భోజనం పంపిణీ చేయడంతో పాటు, ఆస్పత్రి సేవలను అందిస్తున్నామని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందికి సేవలు అందించి ప్రాణాలు నిలబెట్టామన్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలించినంత మాత్రాన కరోనా ప్రమాదం లేదనుకోవద్దని ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించి కరోనా భారినపడకుండా కాపాడుకోవాలని సూచించారు. సిలీండర్‌ పంపిణీ కార్యక్రమంలో *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. వై. శ్రీనివాసరెడ్డి, పట్టణ నాయకులు మూడెత్తుల శ్రీనివాస్‌, కరోనా బాదితుడి కుటుంబ సభ్యులు* పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: