-యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్
మన్యం టీవీ మంగపేట.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాతృమూర్తి కరోనాతో బాదపడుతూ ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే రక్త దానం చేయడానికి ములుగు నుండి హైదరాబాద్ వెళ్తున్న వారి బంధువుల పట్ల డీసీపీ రక్షిత విచక్షణ కోల్పోయి మానవత్వం మరిచి , రక్త దానం చేసి సీతక్క మాతృ మూర్తికి పునర్జన్మను ప్రసాధించటానికి పర్మిషన్ తీసుకొని వెళుతున్న వారిని అడ్డగించి ఆలస్యం చేయడమే కాకుండా, నిత్యం వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఏజన్సీ ఏరియాప్రజా సేవలో పునీత మవుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాటకు కూడా కనీసం విలువ ఇవ్వకుండా అనుచితంగా వ్యవహరించిన డీసీపీ రక్షిత వ్యవహారం గర్హనీయమని ఆమె ఎమ్మెల్యే సీతక్కకు వెంటనే క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ మంగపేట మండల నాయకులు మురుకుంట్ల నరేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి అనాలోచిత పనుల వల్ల కరోనా సమయంలో ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తీసుకు రావద్దని ఆయన కోరారు.ఆయన వెంట పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
Post A Comment: