చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిది :
మండల పరిధిలోని బెండాలపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పద్దం నర్సింహులు (60) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి విషయాన్ని తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ సాబీర్ హుస్సేన్ పార్థివదేహాన్ని సందర్శించి పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో ఓర్సు రామకృష్ణ, మల్లం కృష్ణయ్య, బొర్రా సురేష్, ఈసం ప్రభాకర్, కారం వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: