మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని కోమటిపల్లి ఎం పి యూ పి ఎస్ పాఠశాల లో కొంతమంది పోకిరి యువకులు పేకాట, తాగటం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ సందర్బంగా స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేసారు. చుట్టూ పక్కల కుటుంబాలకు, యువతకు ఎన్ని సార్లు చెప్పిన వారి తీరు మారడం లేదు,. స్కూల్ లో ఉన్న నాపరాయి బండలను తవ్వుకొని పోయారు. వీరిపైన పోలీస్ కేసు పెడదామంటే సరిఅయిన ఆధారాలు లేకపోవడం వలన కేసు పెట్టలేదు. ఈ స్కూల్ కు ప్రహరీ లేకపోవడం, వెంటనే స్కూల్ కు ప్రహరీ కట్టించి గేట్ పెట్టించాలని గ్రామస్తులు కోరుతున్నారు, లేదా ఒక వాచ్ మన్ నియమించాలి అని ఈ సందర్బంగా గ్రామస్తులు జిల్లా, మండలం విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్బంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బడి గుడి తో సమానం అటువంటి పవిత్ర మైన స్థలం లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వగూడదు. ఇకనుండి అయినా యువత, ప్రజలు అప్రమత్తం అయి ఇటువంటి కార్యకలాపాలకు తావు ఇవ్వకుండా మన పాఠశాలను కాపాడుకుందాం అంటూ ఈ సందర్బంగా పేర్కొన్నారు.
Post A Comment: