CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల రైతులు ఆనందంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి,రైతాంగానికి మద్దతునిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృడచిత్తంతో ఈరోజు నుండి రాష్ట్రంలోని 63.25 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.7509 కోట్ల రూపాయలు జమ కానున్నా నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి శుభాకాంక్షలు తెలపటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  పిలుపు మేరకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  ఆదేశానుసారం... ఈరోజు బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగొమ్మురులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక వద్ద మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాత..బంగారు తెలంగాణ రథసారథి... అన్నదాతల ఆప్తమిత్రుడు.... రైతు భాందవుడు..... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి  పాలాభిషేకం చేసిన బూర్గంపాడు మండల ప్రజాప్రతినిధులు,నాయకులు..

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి సర్పంచ్ కొర్సా లక్ష్మీ, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,లక్ష్మీపురం వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,మార్కెట్ కమిటీ సభ్యులు బాణోత్ శ్రీను,మండల టిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ రామారావు, కొనకంచి శ్రీను,తుపాకుల రవి,సోము రొసిరెడ్డి,వీరాంరెడ్డి రామిరెడ్డి, ఆంజనేయులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: