మన్యంటీవీ,అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం కాలనీ లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుచున్నవి. ఈ నేపథ్యంలో విచ్చలవిడిగా మద్యం సేవించి రోడ్లపైనే పడి ఉంటున్న జనాలు పట్టించుకోని అధికారులు. అశ్వారావుపేట నియోజక పరిధిలో అమానుషం, ఆకృత్యం, దీనికి నిదర్శనం అశ్వారావుపేట నియోజకవర్గం. ఆడా మగా తేడా లేకుండా ఈ రోజు మనుషులు ఇలా మద్యానికి బానిసలై అర్థ నగ్నంగా రోడ్ల మీద పడిపోయి, కొందరు చనిపోతున్నారు. మరికొందరు మాన భంగానికి గురై, అటు ఇంట్లో చెప్పుకోలేక ఇటు పోలీస్ స్టేషన్ లో చెప్పుకోలేని పరిస్థితులలో తమ కుటుంబాలకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్న అభ్చాగ్యుల్ను ఎందరినో మనం గమనిస్తూ, చూస్తూ కూడా ఏమి చేయలేని స్థితిలో కళ్ళుమూసుకొని కాలం గడుపుతున్న భయంకర పరిస్థితులు మన ప్రజా పాలనలో కొనసాగుతున్న దుర్భర విషాద ఘటనలు ఎన్నో, గత్యంతరం లేకప్రజా పాలన సరిగా లేక అదుపు తప్పు తుండడం గమనిస్తూనే ఉన్నాం. అక్రమ మద్యాన్ని డేగ కన్ను వేస్తే తప్ప కనిపెట్టడం అంత సులభం కాదని, అధికారులు ఇప్పటికైనా వారి కన్నులు తెరచి అక్రమాలను అరికట్టాల్సినదిగా పై చిత్రంలో కనిపిస్తున్న నికృష్ట స్థితిని బట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు సంభదిత అధికారుల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: