మన్యం టీవీ వాజేడు. ఈరోజు వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామ పంచాయతీలో గత వారం రోజుల నుండి కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. 30 శాతం పాజిటివ్ రేటు కలిగి ఉంది. ఇట్టి విషయమును వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయనైనది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి అట్టి ప్రాంతమును కంట్రోల్ మెంట్ జోన్ గా చేయమని ఆదేశించారు ఈ ఆదేశాలను అనుసరించి ఈరోజు మోతూకులగూడెం, రేగులపాడు, బయ్యారం అనుమూడు గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా చేయనైనది.
కంటోన్మెంట్ జోన్ అంటే ఆ ప్రాంతంలోని ప్రజలు 14 రోజులపాటు ఆ ఊరి వాళ్లు వేరే ఊరికి వెళ్లకుండా, వేరే ఊరి వాళ్ళు ఆ వూరు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. అలాగే ఆ ఊరిలోనే వ్యాపార సముదాయాలు 14 రోజులపాటు మూసివేయాలి. ఆ ఊరిలో ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గారు అల్లం రాజ్ కుమార్ గారు, ఎంఆర్ఐ మురళి కృష్ణ గారు, వైద్య ఆరోగ్య శాఖ వారు హెచ్ హెచ్ ఈ ఓ వేణు గోపాల కృష్ణ గారు సర్పంచ్ అనంతలక్ష్మి గారు పంచాయతీ కార్యదర్శి రవీందర్ గారు పోలీస్ మరియు రెవిన్యూ మరియు పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: