CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీటీసీ కాయం శేఖర్ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అమరారం గ్రామపంచాయతీలో ఎంపీటీసీ కాయం శేఖర్ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. వర్షాకాలం సమీపిస్తున్నందున పంచాయతీలలో మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగానే దోమ తెరలను పంపిణీ చేస్తున్నామని ఎంపీటీసీ కాయం శేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ, పాండురంగాపురం అమరారం కిష్టాపరం పంచాయతీల పరంగా అనారోగ్యంగా ఉండి జ్వర తీవ్రత ఉన్న వారు తనకు వెంటనే తెలియజేయాలని అన్నారు. దోమ తెరలను పంచాయతీలోని కొత్తూరు, కొత్తూరు కాలనీ, జిన్నెల గూడెం, సామర్లకోట,అమరారం గ్రామాలలో దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ రేగా నారాయణ, ఏఎన్ఎం లోహిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share it:

Post A Comment: