మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ఐ చర్చి క్రీస్తు దేవాలయంలో ప్రార్థన నిలిపివేయడం జరిగింది.భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా సంఘ పెద్దలు నిర్ణయం మేరకు ఒక్కొక్కరుగా ప్రార్థనలు చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాగా ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది. ప్రభుత్వ అనుమతులు కూడా ఇవ్వడంతో ఈ ఆదివారం అనగా 27వ తేదీన యధావిధిగా సి.ఎస్.ఐ చర్చి క్రీస్తు దేవాలయంలో ప్రార్థన నిర్వహించడం జరుగుతుందని పాస్ట్ రేట్ చైర్మన్ ఆనందరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించి., భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థన లో పాల్గొనాలని ఆయన కోరారు.
Post A Comment: