✡️రైతుబంధు పథకాన్ని సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేయాలి--ముత్యాల విశ్వనాధం.
✡️రైతు సంఘం(AIKS), సీపీఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన.
మన్యం టీవీ పాల్వంచ:-
కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపి పంటలను, రైతులను ఆదుకోవాలని, రైతుబంధు పథకాన్ని సాగు చేసే ప్రతి రైతుకు వర్తింపజేయాలిని డిమాండ్ చేస్తూ రైతు సంఘం(AIKS) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు సంఘం(AIKS), సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు అందించారు. ఈ సందర్భంగా *రైతు సంఘం(AIKS) జిల్లా అధ్యక్షుడు ముత్యాల విశ్వనాధం* మాట్లాడుతూ తొలకరి వానలతో పంటలు సాగుకు సిద్ధం అవుతున్న రైతుల పాలిట కల్తీ విత్తనాల శాపంగా మారాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ఫెర్టిలైజర్స్ కంపెనీలు అమ్మకందారుల పై ఉక్కుపాదం మోపి రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకంలో మార్పులు తీసుకొచ్చి సాగులో ఉన్న ప్రతి రైతుకు, పంటకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మృతిచెందిన పేదలకు 5 లక్షల పరిహారం చెల్లించాలని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి పేద కుటుంబానికి 50కేజీల ఉచిత బియ్యం, నెలకు 7500/- అందించాలిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, సీపీఐ, రైతు సంఘము జిల్లా నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వశ్వరరావు, అన్నరపు వెంకటేశ్వర్లు, జ్యోతుల రమేష్, కోటి నాగేశ్వరరావు, ఎర్రగడ్డ సత్యనారాయణ, సిహెచ్ పాపారావు, కృష్ణ, రామ్ చందర్, ఉపేందర్ రెడ్డి, బానోతు రంజిత్, పర్వీన్* తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: