అఖిలభారత రైతుకూలి సంఘం డిమాండ్.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
వ్యవసాయ సీజన్ కావడంతో వివిధ కంపెనీల వారు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టడం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతున్నారని అలా నష్టపోకుండా ప్రభుత్వం నకిలీ విత్తనాలు పురుగు మందులు అమ్మే కంపెనీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు ఎస్కే ఉమర్, వరికూటి వెంకట్రావు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చండ్రుగొండ మండల కేంద్రంలో తోలెం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన రైతు కూలీ సంఘం ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కే ఉమర్ సబ్ డివిజన్ నాయకులు వరికూటి వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్తీ విత్తనాలు అరికట్టాలని ఎరువులను విత్తనాల ధరలను తగ్గించాలని. అలాగే మండలంలోని చండ్రుగొండ, మద్దుకూరు, తుంగారం, గ్రామాల్లో నిర్మాణం చేసిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వాలని వాటికి కరెంట్ సౌకర్యం నీటి వసతి కల్పించి రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఇల్లు లేని గిరిజనులు గిరిజనేతరుల పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధారావత్ బాలు, డి దాస్, పి ముత్తయ్య, బద్రు, కిషన్, రాములు, పద్దం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: