*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగు పల్లి గ్రామంలో కోవిడ్ కేసులు అధికంగా నమోదు కావడంతో అధికారులు కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ప్రజలు మాస్క్ లు, ధరించి సామాజిక దూరం పాటించాలని అనవసరంగా రోడ్లపై తిరిగి కరోనా బారిన పడి కుటుంబీకులను అనారోగ్యాల పాలు చెయ్యవద్దని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందిపై ఈ చలన ద్వారా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Post A Comment: