✍️ ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మన్యం టీవీ పాల్వంచ:- కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సూపర్ బజార్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్, రామవరం సెంటర్లలో ఆటో డ్రైవర్ ల కొరకు షెడ్లు మరియు టాయిలెట్ నిర్మాణాన్నికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి, మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వెంటనే నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మరియు కొత్తగూడెం ఎమ్మార్వో కి ఆదేశాలు జారీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు
ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ఆటోడ్రైవర్లకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా
మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, పట్టణంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని, ఎవరేమనుకున్నా అనుకున్నది సాధించి తీరుతాను అని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దామోదర్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ, కౌన్సిలర్ పరమేష్ యాదవ్ టిఆర్ఎస్ నాయకులు బీమా శ్రీధర్, కంభంపాటి దుర్గాప్రసాద్, టీబీజీకేఎస్ నాయకుడు కాపు కృష్ణ, కుసపాటి శీను, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: