CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధికి వర్షం అడ్డంకి కాదు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

జోరువానలో అభివృద్ధి ఆగలేదు వర్షం కుండపోతగా కురుస్తున్న గిరిపుత్రుల సమున్నత అభ్యున్నతికి పునాదులు వేసే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయాన్ని బుధవారం కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ_ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతం పొగుళ్లపల్లి లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని ఇక్కడ విద్యార్థులు అధ్యాపకులకు శుభాకాంక్షలు అని అన్నారు. ఈ మోడల్ స్కూలు ఆధునిక దేవాలయాలు అని ఈ పనులను వేగంగా చేసి తొందరగా భవన నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మహబూబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుమారి బిందు, జిల్లా కలెక్టర్ పివి గౌతమ్, ఏటూరు నాగారం ఐటిడిఏ పీవో హనుమంతు కె.జెండా గే, అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: