మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారం గ్రామపంచాయతీ పరిధిలోగల ఎల్లాపురం గ్రామంలో కరోనా బాధితుల 8 కుటుంబాలకు గ్రామ పంచాయితీ సర్పంచ్ మోకాళ్ళ కృష్ణ గారి చేతుల మీదగా గుడ్లు, పాలు, పండ్లు, కూరగాయలు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ ఉపాధ్యక్షుడు వూకే కృష్ణ, కిన్నెర మల్లేష్ కుమార్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ భానుచందర్, గ్రామ పటేల్ సనప సంతోష్ గ్రామ పెద్దలు కన్నయ్య యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: