మన్యం మనుగడ పినపాక: పినపాక మండలంలోని జానంపేట గ్రామానికి చెందిన ప్రముఖ ఎరువుల షాపు యజమాని కన్నెగంటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు,ఆశ వర్కర్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్ఫూర్తితో ,తండ్రి దుర్గ ప్రసాద్ సహకారంతో జానంపేట గ్రామంలోని కిడ్నీ బాధితురాలు గాండ్ల మల్లిక కు 20,000/-ల ఆర్థిక సహాయంను,15 మంది విద్యార్థులకు కు ఒక్కొక్కరికి 2,000/- చొప్పున,
5 గురి ఆశ వర్కర్లకు ఒక్కొక్కరికి 1000/-చొప్పున ఆర్థిక సహాయంను అందజేయడం జరిగింది.ఈ మొత్తాన్ని జానంపేట సర్పంచ్ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో, రేగా కాంతారావు స్ఫూర్తితో ఆర్థిక సహాయం చేయగలిగాను అని కన్నెగంటి అనిల్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్క ఫొన్ చేస్తే చాలు ఉచితంగా కోవిడ్ బాధితుల కోసం ప్రైవేటు అంబులెన్స్ సౌకర్యంను కల్పించనున్నారు.ఈ కార్యక్రమంలో జానంపేట ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవివర్మ , ములుగు జిల్లా టిఆర్ఎస్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, అనిల్ కుమార్ తండ్రి కన్నెగంటి దుర్గాప్రసాద్, గాండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: