స్వయం పోషకానివి కావు
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెరాస పార్టీ మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి హాజరైనారు.
మండల ఇంచార్జ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తయారు చేసిన వాళ్లే మీరంతా
ఎదిగే అంత వరకు ఒక రకం ఎదిగినంక ఇంకొరకం
దోపిడీ చేయనిస్తే మంచి,లేకుంటే చెడ్డ, అనే విధంగా ఎదిగి నాయకుల తీరుగా ఉంది
ఈటెల రాజేందర్ గుర్తుంచుకో నిన్నటి వరకు కేసీఆర్ వెంట ఉన్న నువ్వు, తెలంగాణ లో
హీరోవి,నేటి నుంచి నువ్వు బీజేపీ లో చేరుతున్నావు కాబట్టి జీరోవి,
కేసీఆర్ విడిచి బీజేపీలో చేరినా లీడర్లు ,జితేందర్రెడ్డి ,విజయశాంతి,విజయరామరావు ,
చంద్రశేఖర్, దిలీప్ కుమార్, విశ్వేశ్వర్రెడ్డి, ఆ రోజు కేసీఆర్ వెంట ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ లీడర్లు పరిస్థితి ఏమిటి, వాపును చూసి బలుపు అనుకుని కేసీఆర్ విడిచి బీజేపీ లో చేరిన వారికి వీరి అడ్రస్ ను గల్లంతు,నీవు కూడా వారి దారిలోనే వెల్లుతున్నావు, చివరికి నీవు కూడా వారిలాగనే అడ్రస్ లేని నాయకునిగా మిగిలిపోక తప్పదు,
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉంటాయి కావచ్చు కానీ ఎప్పటికి ఈ రాష్ట్రానికి ఇక్కడ ప్రజలకు నాయకుడు ఒక్కడే కేసీఆర్
జానారెడ్డి కంటే నీవేం గొప్ప లీడరువు కావు.
జానారెడ్డి కేసీఆర్ ముందు మట్టి కరవక తప్పలేదు నీవెంత
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి నీవు ఆత్మాభిమానం చంపుకొని సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి చేరితే బీజేపీలో చేరు,
కానీ కేసీఆర్ ని అంటే మాత్రం ఉరుకునేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని గుర్తుంచుకోవాలి అని ఈసందర్బంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి,మండల అధికార ప్రతినిధి కటికనేని దినాకర్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, వెంకట్ రెడ్డి, శానం నరేందర్, కోడం సత్యనారాయణ,చిట్టిబాబు, సుబ్బాయనాయుడు,అర్జున్ ముకుందం ,సతిష్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: