గుండాల (మన్యం టీవీ)ములుగు ఎమ్మెల్యే సీతక్క ను కాంగ్రెస్ మరియు టిడిపి నాయకులు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీతక్క మాతృమూర్తి కరోనాతో చికిత్స పొందుతున్న తరుణంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై సీతక్క ను అడిగి తెలుసుకున్నారు. దానితోపాటు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం తలెత్తుతుందని ఆమెకు వివరించారు. ఈ సమావేశంలో మండల సమస్యలపై ఆమెకు వివరించామన్నారు దానితోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ కార్యదర్శిగా ఉన్నందున మండల సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎం పి టి సి ఎస్కే సంధాని , మామ కన్ను సర్పంచ్ ముత్య మా చారి, సాయన్న పల్లి ఎంపీటీసీ కృష్ణారావు , కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తయ్య , పెండ కట్ల దుర్గ , టిడిపి నాయకులు మొల్క మధు తదితరులు ఆమెను కలిశారు
Post A Comment: