మన్యం టీవీ, అశ్వాపురం:గురువారం నాడు బట్టీల గుంపు పాములపల్లి పంచాయితీలో కరోనా బాధితుల కేసులు పెరగడంతో, బట్ట మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బట్ట విజయ్ గాంధీ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం గుడ్లు కూరగాయలు పప్పు పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ అధ్యక్షులు బట్ట విజయ్ గాంధీ మాట్లాడుతూ, కరోనా కి ఎవరు భయపడవద్దని చెప్పారు. కరోనాను అరికట్టాలంటే సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా బాధితుల కుటుంబాల సభ్యులు ఎవరు కూడా బయట తిరుగు వద్దనే కోరారు. ఈ ట్రస్టు ద్వారా వివిధ వ్యాధిగ్రస్థులకు రక్తం అవసరం ఉంటే మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బట్టీల గుంపు పంచాయితీ సర్పంచ్ బట్ట సత్యనారాయణ అమ్మ గారి పల్లి పంచాయతీ సర్పంచ్ భద్రయ్య, బట్టా మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు లోడిగ నర్సింహారావు, కుంజా శ్రీను, కొమరం వీరయ్య, సప్కా వీరయ్య,పాయం సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్ బట్టా అరుణ, ఆశా వర్కర్ సప్కా రమాదేవి, రామ్ నగర్ అంగన్వాడీ టీచర్ బట్టా రమాదేవి,ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తాటి సత్యనారాయణ, బొర్రా శ్రీను, ఇర్పా వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: