CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుపేద అన్నార్తులకు అపన్నహస్తం వనమా మహిళ వారియర్స్ మరియు అంబేద్కర్ మహిళ సంఘ నాయకురాళ్లు...

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ :-

ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని చిట్టి రామవరం మరియు స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్ లో గల నిరుపేదలకు మరియు యాచకులకు ఈ రోజు పౌష్టికాహార భోజనం వనమా మహిళా వారియర్స్ మరియు అంబేద్కర్ మహిళ సంఘ సభ్యులు మాట్ల గాయత్రి, కెడెం కృపావేణి, నక్కా సృజన, ఆశ వర్కర్ భూక్య గంగా గార్ల ఆధ్వర్యంలో పంపిణీ చెయ్యడం జరిగింది...


ఈ సందర్భంగా మహిళా సంఘ నాయకురాళ్లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారి ప్రోత్సాహం, మరియు ప్రోద్బలంతో మేము ప్రతి కార్యక్రమం సక్సెస్ చెయ్యగలుగుతున్నాం అని చెప్పడం జరిగింది...

అలాగే స్థానిక చిట్టి రామవరం ఏరియాలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాల వారికి ఉండటానికి ఇండ్లు లేక తినడానికి తిండి లేక దుర్భర జీవితం అనుభవిస్తూ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఇలాంటి వారిని ప్రభుత్వం అలాగే స్థానిక నాయకులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఈ సందర్భంగా చెప్పడం జరిగినది...

రానున్న కాలంలో కరోనా మహమ్మారి కారణంగా చిన్న పిల్లలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున పిల్లల తల్లులకు పిల్లల పై తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, పిల్లల జీవన విధానం ఎలా ఉండాలి, వారికి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి అనే దానిపై అవగాహన కల్పించడం జరిగింది...

ఈ కార్యక్రమంలో మాట్ల భాగ్యరాజ్, సాంసన్, షణ్ముఖ ప్రియ, శహనాజ్, సుజాత, వెంకటమ్మా, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: