CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయతీ అభివృద్దిలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

Share it:

 



పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ


మన్యం మనుగడ, పినపాక: 


పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో మండలంలోని తోగ్గూడెం, పినపాక పంచాయతీలను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా వైకుంఠ దామాలు, చెత్త సేకరణ కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాలు, పంచాయితీ ట్రాక్టర్ లకు సంబంధించి అభివృద్ధిలో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు ప్రధాన భూమిక పోషించాలని, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అన్నారు. పంచాయతీ అభివృద్ధి లో భాగంగా పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా గల ప్రతి పంచాయతీలో ఎవరికి వారు అభివృద్ధి పనులను చేయకుండా, ప్రభుత్వం నుండి వచ్చే నిధులను దుర్వినియోగం చేయకుండా ఉండాలని, ప్రభుత్వ నిధిని పంచాయతీ అభివృద్ధికి వినియోగించి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి , ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య పిఎసిఎస్ చైర్మన్ వర్మ, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, పాత మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంపెల్లి తిరుపతి,మండల నాయకులు వాసు బాబు , బొలిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: