కరోనా బాధితులకు బియ్యం,నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన కణ్ణపురం.మల్లీశ్వరి భర్త సత్యనారాయణ, మరియు అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న టువంటి ఊట్ల సునీల్ కుమార్ చాలా నిరుపేద కుటుంబం, అనువారు కరోనా బారిన పడి హోమ్ ఐషాలేషన్ లో ఉంటున్నారు.వీరు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు అని,వీరికి ఎవరు లేరు అని, తెలుసుకున్న నవీన్ బాబు వారి ఆర్మీ సభ్యుల ద్వారా వారికీ నిత్యవసర సరుకులు మరియు 25 కేజీ ల బియ్యం మానవతా దృక్పధం తో నవీన్ బాబు ఆర్మీ కమిటీ సభ్యులు మజీద్,శివ, ఉదయ్,అరవింద్ తదితరులు వారి ఇంటికి వెళ్లి సహాయం ఆందజేయడం జరిగింది.
Post A Comment: