🔥మన్యం మనుగడ కథనానికి స్పందిస్తున్న దాతలు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
తోగూడెం గ్రామానికి చెందిన కడు నిరుపేద జిమ్మడి నరసింహారావు గుడిసె వర్షం మూలంగా కూలిపోయింది .ఈ నేపథ్యంలో గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన హనుమాన్ సేవా సమితి బాధ్యులు కన్నె రమేష్ మానవతా దృక్పథంతో రూ వెయ్యి బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో తోగూడెం నాయకులు కల్తీ లక్ష్మయ్య, సతీష్ చారి, నరేష్ రెడ్డి,బండ మనోజ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: