మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లో కరోనా బారినపడి, ఇంటివద్ద సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న పేద వారి కోసం తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఎల్చి రెడ్డి పల్లి ఆశ్రమ పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రేగా కాంతారావు, పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి లు ఐసోలేషన్ గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పినపాక మండల తాహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరూ ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని, కరోనా రోగుల కు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి అని తెలియజేశారు. అనంతరం పినపాక మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, 30 పడకల తో కేంద్రాన్ని ప్రారంభించామని, కరోనా బాధితులు వినియోగించుకోవాలని, దశలవారీగా సిబ్బంది ఐసోలేషన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, ఆర్ ఐ వీర్రాజు, వీరభద్రం, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు, గడ్డం పల్లి, ఎల్చి రెడ్డిపల్లి ల సర్పంచులు సునీల్ కుమార్, నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి అజార్,
వి ఆర్ ఓ , విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: