పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష
మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మణుగూరు పట్టణానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై సోమవారం మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ మరియు సిబ్బందితో విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమావేశం అయ్యారు.పట్టణం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను విప్ రేగా కాంతారావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పొశం.నర్సింహారావు,నియోజకవర్గం యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: