మన్యం టీవీ కరకగూడెం : వర్షాకాలం సీజన్లో ఇంట్లో జ్వరాన్ని పరీక్షించుకోవాడనికి థర్మామీటర్ ఎంత ముఖ్యమో ఇప్పుడున్న పరిస్థితులలో కూడా కరోనా వ్యాధిని పరిక్షించుకోనుటకు పల్స్ థర్మామీటర్ కూడ అంతె ముఖ్యమని పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా అన్నారు. బుధవారం మండలరిదిలోని కరకగూడెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ,రక్షకభటుల నిలయానికి ,కరకగూడెం ప్రెస్ క్లబ్ కి పల్స్ ఆక్సీమీటర్ లను అంద చేయడంజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి కరోనా నివారణ పట్లా అప్రమత్తంగా ఉండవచ్చని తెలిపారు. అదేవిధంగా శరీరంలో పల్స్ రేట్ గుర్తించేందుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డా,,పర్షియా నాయక్ కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ ఆత్మ కమిటి డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం రేగా సత్యనారాయణ వైద్య సిబ్బంది, పోలిస్ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.
Post A Comment: