మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు లో గత నెల రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్న శివ- జ్యోతిర్మయి దంపతులు సోమవారం కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగుల గండి గ్రామంలో కరోనా వచ్చి,హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి ప్రతిరోజు భోజన ఏర్పాటు చేయ లేనందువలన గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు మరియు మాస్క్ లను పంపిణీ చేశారు.వారికి కోవిడ్ రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు, వచ్చిన తరువాత పాటించవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన మామిళ్ల.కనిష్,దొంతు.నవీన్,సాయి కుమార్,మదమంచి. సత్యనారాయణ,జగన్ కు శివ-జ్యోతిర్మయి కృతజ్ఞతలు తెలియచేస్తూ,భవిష్యత్తు లో కూడా అవసరమైన వారికి అండగా నిలుస్తాను అని తెలియజేశారు.
Post A Comment: