మన్యం మనుగడ, మణుగూరు:
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పివి కాలనీ కూనవరం గేట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఏరియా
ఐ ఎఫ్ టి యు నాయకులు ఏ మంగీలాల్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలన్నారు
ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల పాటు ప్రతి దానిపై పెట్రోల్ ధరల ప్రభావం పడుతుందని ఆయన వాపోయారు సామాన్యుని బతుకు భారం అయిందని ఒకవైపు కరోనా మరోవైపు పెట్రోలు ధరల పెంపు మధ్యతరగతి కుటుంబాలు, నిరుపేద కుటుంబాల పై పెను భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు కే గురుమూర్తి, కె వీర్రాజు, ఏం సాంబ ,జి సాయికుమార్, యం భావ్ సింగ్, వెంకటేశ్వర్లు ,వినయ్ ,నాగరాజు శ్రీనివాస్ గోపి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: