మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట మానవ సేవా యూత్ ఆధ్వర్యంలో ఈరోజు పాలయిగూడెంలోని కరోనా బాధితులకు నిత్యావసర సరుకులను ముద్దం అశోక్ రెడ్డి అందజేశారు. ఇటువంటి కష్టకాలంలో బాధితులకు చేయూతనివ్వటానికి ఏర్పడిన మానవ సేవా యూత్ ఏర్పాటుచేసి తద్వారా రోజుఏదో ఒక గ్రామంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందించటం హర్షించదగ్గ విషయం ఈ రోజు నేను కూడా ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందంటూ ఎల్. ఐ.సి. ముద్దం అశోక్ రెడ్డి ఈసందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ముద్దం అశోక్ రెడ్డి,ఎర్రం శ్రవణ్ కుమార్, జయరాజు, నాగేంద్రబాబు, నాగరాజు, ఆదిబాబు, రామ్మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: