గుండాల /ఆళ్ల పల్లి (మన్యం టీవీ ) ఆళ్ల పల్లి మండలం పరిధిలోని చంద్రాపురం గ్రామంలో ఇల్లు దగ్నం సంఘటన చోటు చేసుకుంది. చంద్ర పురం గ్రామానికి చెందిన బొమ్మల ఈశ్వర్ వంట చేసుకునే గడ్డి ఇల్లు కాలిపోయింది. ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి విత్తనాల పండగ కోసం గ్రామ సమీపంలో వనభోజనాలకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వన భోజనాలు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లు కాలిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వంట సామాగ్రి. తో పాటు బియ్యం ఇతర వస్తువులన్నీ కాలిపోయాయి ఇల్లు ఎలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నా లేదా మరే ఇతర కారణాలతో మంటలు చెలరేగాయ అని తెలియాల్సి ఉంది
Post A Comment: