నిద్రావస్థలో అధికారులు
మన్యం టీవీ, పాల్వంచ :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామం శివారులో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కల దుస్థితి చెప్పకనే చెబుతున్నది గ్రామ పంచాయతీల నిర్వాకం ప్రజల డబ్బు పై ఎలా ఉందో అని. కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి తెలంగాణ రాష్ట్రం అంతటా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం మరియు వాటి పెరుగుదల బాధ్యత గ్రామపంచాయతీలకు అప్పజెప్పి ప్రభుత్వం పర్యావరణ పచ్చదనానికి కృషి చేస్తుంటే కొన్ని గ్రామ పంచాయతీలలో మొక్కల పెంపకం కనీస భాధ్యత అయిన సేఫ్టీ ఫెన్సింగ్ స్టాండర్డ్ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించకపోవటం ప్రజా ధనాన్ని ఈ గ్రామ పంచాయతీలు ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నాయి అని తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి సమస్యలు ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పంచాయతీలలోనే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల ఇలానే ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం... ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇలాంటి వాటికి స్వస్తి చెప్పి ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడాలని విన్నవించుకున్న ప్రజలు...
Post A Comment: