మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్షాకాల సీజనల్ వ్యాధులు పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే గారు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో కలుపు మొక్కల నివారణ పిచికారి చేయించారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని కోరారు.
Post A Comment: