మన్యం టీవీ ఏటూరు నాగారం ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనుముల రేవంత్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ములుగు జిల్లా తాడ్వాయి మండల కాంగ్రెస్ కమిటీ ఆద్వర్యం లో ఎమ్మెల్యే సీతక్క నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు తాడ్వాయి ప్రధాన కూడలి వద్ద బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.దీనికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తాడ్వాయి మండల పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్,కామారం సర్పంచ్ రేగా కల్యాణి, మాజీ జడ్పిటీసి బొల్లు దేవేందర్,సింగిల్విండో డైరెక్టర్ యాణాల సిద్దిరెడ్డి ,జిల్లా నాయకులు అరేం లచ్చు పటేల్, ముదురుకొల్ల తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్,మరియు నాయకులు కోర్నిబెల్లి వీరేశం, పాయం కోటి, బంగారు రమేష్,మోకాళ్ళ వెంకటేష్, వర్దెల్లి బాలు, గవుని మధు అనుమల్ల రాజిరెడ్డి, రేగా జయ, గుర్రాల రాజేందర్, బంగారు శ్రీధర్, మీడియా ఇంచార్జి సాధు. చక్రపాణి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: